ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తా
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
కోదాడ, మార్చి 9: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష సామాగ్రి కిట్ ను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసి, రాష్ట్రస్థాయిలో అత్యున్నత ఫలితాలు సాధించాలని కోరినారు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన వెస్టేజ్ స్టోర్ ను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇటీవల మోకాలు ఆపరేషన్ చేయించుకున్న పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గురవమ్మ సైది బాబు, మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




