ఒక్కరోజే 14 లక్షల కోట్ల సంపద ఆవిరి
- సెన్సెక్స్ 2,500 పాయింట్ల పతనం
- యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న చమురు ధరలు
ముంబై, మార్చి 19: ఇజ్రాయెల్, అమెరి కా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ద ప్రభావంతో పెరుగుతున్న చమురు ధరలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చుట్టూ నెలకొన్న వివాదాలు పెట్టుబడిదారులను భయ పెట్టడంతో భారత్ షేర్ మార్కెట్లు తీవ్రంగా పడిపోయాయి. ఇది భారీ అమ్మకాలకు దారితీసి, గురువారం ఒక్కరోజే రూ. 14 లక్ష ల కోట్ల సంపదను తుడిచిపెట్టింది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1953 పాయింట్లు కూలి పోగా, నిఫ్టీ 453 పాయింట్లు జారింది.
మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఈ పత నం మరింత తీవ్రంగా మారి సెనెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 800 పాయింట్లు దిగజారింది. రోజు ముగిసేసరికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపనీల మార్కెట్ విలువలో రూ.14 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులతో చమురు కేంద్రాలు దెబ్బతినడం, ధరలు పెరగడం మార్కెట్ను భయాందోళనకు గురి చేశాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారె ల్కు 110 డాలర్లను దాటడంతో ఇంపోర్ట్పై ఆధారపడే భారత్కు అదనపు ఒత్తిడి ఏర్పడింది.
అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చైర్మ న్ రాజీనామ కూడా ఒక కారణమైంది. బ్యాంకులోని ‘కొన్ని సంఘటనలు, పద్ధతు లు నా వ్యక్తిగత విలువలు, నైతికతకు అనుగుణంగా లేవు’ అని పేర్కొంటూ పార్ట్-టైమ్ ఛైర్మన్ అటాను చక్రవర్తి రాజీనామా చేసిన తర్వాత, ఆ స్టాక్ 5% పైగా పడిపోయి సు మారు రూ.800కి చేరింది.ఇతర బ్యాంకులతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరులో తీవ్రమైన పతనం, స్టాక్-నిర్దిష్ట ఒత్తిడి , విస్తృత మార్కెట్ బలహీనతల మిశ్రమాన్ని సూచి స్తూ, మొత్తం ప్రతికూల సెంటిమెంట్ను మ రింత పెంచుతోంది.
ఇది పెట్టుబడిదారుల్లో ఆందోళనను కలిగించింది. బ్యాంకింగ్ స్టాక్స్ పై భారీ అమ్మకాలు నమోదవడంతో సూచీలపై మరింత ఒత్తిడి పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక్కటే సెన్సెక్స్ను వందల పాయిం ట్లు లాగేసింది.ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా భారీగా పోవడంతో సూచీలు మరింత దిగజారాయి. లారెన్స్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్ వంటి భారీ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేశాయి.
అమరికా ఫెడరల్ రిజర్వ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారా యి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడింది.మరోవైపు గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగెటివ్ సంకేతాలే ఇచ్చింది. ఫ్యూచర్స్ 23,324 వద్ద,453 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవ్వడం ద్వారా ముందుగానే మార్కెట్ పతనానికి సంకేతాలు ఇచ్చింది.




