calender_icon.png 27 June, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభ స్వాగతం!

27-06-2025 01:34:28 AM

  1. ఐఎస్‌ఎస్‌తో యాక్సియం-4 డాకింగ్ సక్సెస్
  2. అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశు 
  3. ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డు

ఐఎస్‌ఎస్‌లో 14 రోజులపాటు పరిశోధనలు

న్యూఢిల్లీ, జూన్ 26: అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో కీలక విజ యాన్ని అందుకుంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) అడుగుపెట్టింది. ఈ మేరకు గురువా రం సాయంత్రం 4.30 గంటలకు వీరు ప్రయాణిస్తున్న యాక్సియం-4 మిషన్.. ఐఎస్‌ఎస్‌తో డాకింగ్ (అనుసంధానం) ప్ర క్రియ విజయవంతమైంది.

బుధవారం మ ధ్యాహ్నం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4 స్పేస్ క్రాఫ్ట్ 28 గంటలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. భూ మి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ గంటకు 17వేల కిలోమీటర్ల వేగం తో ప్రయాణించిన యాక్సియం-4 మిష న్ ఆ తర్వాత ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయింది.

యాక్సియం-4 మిషన్ బృం దానికి శుభాంశు శుక్లా పైలెట్‌గా వ్యవహరిస్తుండగా.. అమెరికాకు చెందిన మాజీ నాసా వ్యోమగామి కమాండర్ పెగ్గీ విట్సన్, పోలండక్‌కు చెందిన మిషన్ నిపుణులు స్లావోజ్ ఉజ్నాన్ విస్నీయెస్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు ఉన్నారు. కాగా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తర్వాత శుభాంశు తన అనుభ వాలను పంచుకున్నారు. ‘భారతీయులకు చిన్న సందేశం.

నేను ౬౩౪వ వ్యోమగామిని. అంతరిక్ష కేంద్రం లో అంతా కొత్తగా కనిపిస్తోంది. భార రహిత స్థితిలో గాలిలో తే లుతున్నా. నా తల మాత్రం చాలా బరువుగా అనిపిస్తోంది. మేం అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టగానే అక్కడున్న వారు మా క్యాబిన్ తలుపు తీసి సాదరంగా లోనికి ఆహ్వానించారు. అక్కడున్న సిబ్బంది ని చూసి తొలుత ఆశ్చర్యానికి గురైనప్పటికీ తర్వాత సంతోషంగా అనిపించిం ది.

రానున్న రెండు వారాలు ఐఎస్‌ఎస్‌లో ఉత్సాహంగా గడపాలనుకుంటున్నా.’ అని శు భాంశు చెప్పుకొచ్చారు. కాగా శుభాంశు బృ ందం రెండు వారాల పాటు ఐఎస్‌ఎస్‌లో అ నేక పరిశోధనలు చేయనున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టిం చారు. 1984లో మరో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొ లి భారతీయుడిగా నిలిచినప్పటికీ అంతరిక్ష కేంద్రానికి మాత్రం వెళ్లలేదు.

రెండువారాల్లో 60 ప్రయోగాలు..

శుభాన్షు శుక్లా నేతృత్వంలోని బృందం రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటుంది. ఈ సమ య ంలో దాదాపు 60 శాస్త్రీయ ప్రయోగాలను చేపట్టునున్నారు. వీటిలో ఏడు ప్రయో గా లను భారతీయ పరిశోధకులు ఎంపిక చే శా రు. ముఖ్యంగా మైక్రో ఆల్గేపై అధ్యయ ంతో పాటు, అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావా న్ని అంచనా వేయడం లాం టివి ఉ న్నాయి.

భూమిపై ఉన్నప్పటి కంటే అంతరిక్షంలో ఉ న్నప్పుడు ఈ సూక్ష్మ శైవలాల ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లు, జీవరసాయన చర్యల్లో జరిగే మా ర్పులను పరిశీలిస్తారు. గురుత్వాకర్ష ణ స్థితిలో కండరాల పునరుద్ధరణపై కూడా శుక్లా బృందం దృష్టి సారించనుంది. భార ర హిత స్థితిలో పలు ప్రయోగాలతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటించనున్నారు.

మొత్తంగా యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. త ద్వారా ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. కాగా శుభాంశు అంతరిక్ష యాత్రం కోసం భారత్ రూ. 550 కోట్లు ఖర్చు చేసినట్టు ఇస్రో తెలిపింది. 

నడక నేర్చుకుంటున్నా: శుభాంశు

అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడానికి ముందు భూకక్ష్యలో తిరుగుతున్న సందర్భంలో శుభాంశు అంతరిక్షం నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని తెలిపిన శుభాంశు.. భారరహిత స్థితిలో ఎలా నడవాలో నేర్చుకుంటున్నట్టు తెలిపారు. ‘అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది.

30 రోజుల క్వారంటైన్ తర్వాత ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నాం. మాతో పాటు జాయ్ అనే ఒక హంస బొమ్మ కూడా వచ్చింది. భారత సంప్రదాయంలో హంసను విజ్ఞానంగా సూచిస్తారు. అంతరిక్షంలో భార రహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్నా. ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను నేర్చుకునేందుకు చిన్నపిల్లాడిలా మారిపోయా.

నా భుజంపై మన మువ్వన్నెల పతాకముంది. అది చూస్తున్నప్పుడల్లా నేను ఒంటరి కాదు.. నా వెంట కోట్ల మంది భారతీయులు ఉన్నారనే భావన కలుగుతుంది. ఐఎస్‌ఎస్ నుంచి నా అనుభవాలను పంచుకునేందుకు ఎదురుచూస్తున్నా’ అని శుభాంశు పేర్కొన్నారు.