calender_icon.png 27 June, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం

27-06-2025 12:54:30 AM

  1. అలకనంద నదిలో పడిపోయిన బస్సు
  2. ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదిమంది గల్లంతు

న్యూఢిల్లీ, జూన్ 26: ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌తో పాటు 20 పర్యాటకులున్న బస్సు గురువారం అలకనందనదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది గల్లంతయ్యారు. ఘోల్తీర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిం ది. ఉత్తరాఖండ్ పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 8 మందిని సురక్షితంగా కాపాడా రు.

తప్పిపోయినవారి కోసం గాలింపు చర్య లు కొనసాగుతున్నాయి. ఐజీ నీలేశ్ ఆనంద్ మాట్లాడుతూ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి పలువు రు పర్యటకులు బద్రీనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.  రాష్ట్రంలో భారీగా వర్షాలు కు రుస్తుండటంతో నది పొంగిపొర్లుతోంది.

దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. మరో ఐదుగురు రుద్ర ప్రయాగ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి ‘ఎక్స్’ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.