ఘనంగా వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ప్రారంభం
31-05-2026 12:00 AM
ప్రారంభించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్నగర్, మే 30 (విజయక్రాంతి): బేగంపేట్ కంట్రీ క్లబ్ ప్రాంగణంలో వెల్నెస్ హాస్పిటల్ ఎనిమిదవ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాస్పిటల్ యాజ మాన్యంతో రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
వెల్నెస్ హాస్పిటల్ ఎండిలు సుమన్, అసద్, వివేకానంద రెడ్డి లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ చైర్మన్ కవిత రెడ్డి, మాజీ కార్పొరేటర్ నా మన శేషు కుమారి, సనత్వ డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






