26-05-2025 01:05:27 AM
-కవిత లేఖ అంశంపై గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు?
-రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠ
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖపై రకరకాలుగా ఊహాగానాలు వెలువడతున్న నేప థ్యంలో గులాబీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ అటు పార్టీ శ్రేణుల్లో ఇటు రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించిన అంశాలపై పాజిటివ్, నెగిటివ్ అంటూ కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. లేఖ కలకలం సృష్టిస్తున్న సమయంలో అమెరికాలో ఉన్న కవిత హైదరా బాద్కు చేరుకున్న తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ లేఖ తాను రాశానని చెప్తూనే కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయ ని వారిని దూరంపెడితేనే పార్టీకి మంచిదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు పార్టీలో కోవర్డులున్నారంటూ చేసిన వ్యాఖ్య లు గులాబీ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. ఈ కామెంట్లపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని పార్టీల్లో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారని, తమ పార్టీలో ఉన్న కోవర్టులు సమయం వచ్చినప్పుడు బయటపడతారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
కవిత రాసిన లేఖపై స్పందిస్తూ సూచనలు, సలహాలు గతంలో తాము నిర్వహించిన పార్లమెంటరీ సమావేశాల్లో వేలమంది కార్యకర్తలు తమ దృష్టికి తీసుకొచ్చారని, అంతర్గత అంశాలు అంతర్గతంగానే చెప్పాలంటూ మాట్లాడారు. దీంతో కవిత లేఖ రాసిన అంశాన్ని కేటీఆర్ లైట్గా తీసుకున్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కవిత లేఖపై గులాబీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చలు కూడా జోరందుకున్నాయి.
ఎంతోమంది పార్టీని వీడినా..
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎన్నో స ంక్షోభాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పా ర్టీని వీడిన నేతల లిస్టు పెద్దగానే ఉన్నది. కేసీఆర్తో విభేదాలు కారణంగా ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్, పొంగులే టి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు వీరితో పాటు ఇంకా చాలామంది సీనియర్ నేతలు గులాబీ పార్టీలో సస్పెన్షన్కు గురయ్యారు.
ప్రధానంగా వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చాలా మంది కారు పార్టీ ఎ మ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు పార్టీ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అన్ని సంక్షోభాలను ఎదుర్కొంటూ కేసీఆర్ బ లంగా నిలబడ్డారు. అయితే ఇప్పుడు వచ్చిన రాజకీయపరమైన ఇబ్బందులు సొంత కుటుంబం నుంచే కావడంతో కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
కవిత ఇప్పటికే సామాజిక తెలంగాణ పేరుతో కులసంఘాలతో కలిసి ఉద్యమించే కార్యాచరణ రూపొందించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎయిర్ పోర్టులో కవిత వచ్చే సమయంలో సామాజి క తెలంగాణ ఉద్యమకారిణికి స్వాగతం అం టూ బ్యానర్లు, ఫ్లకార్డులతో ఆమె ఫాలోవర్లు, నేతలు హంగామా చేశారు. కవిత అప్పుడు చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఎయిర్పోర్ట్లో ఈ బ్యానర్ల దర్శనం ఇవ్వడంతో కవిత సోషల్ ఇష్యూస్పైన భవిష్యత్లో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కొ ట్టిపారేయ్యలేమంటున్నారు కొందరు గులాబీ నేతలు.
కేసీఆర్ నిర్ణయమే కీలకం..
కవిత పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణ జాగృతిని తెలంగాణలో గ్రామస్థాయి కమిటీల నుంచి రాష్ట్రస్థాయి నుంచి అంతర్జాతీయంగా కూడా శాఖలను ఏ ర్పాటు చేసి ఆ సంస్థను బలోపేతం చేసింద ని అట్లాంటి ఆమె పొలిటికల్ స్ట్రాటజీలు అ మలు చేయడం పెద్ద కష్టమేని కాదన్న వాదనలు మరికొందరు గులాబీ నేతలు చే స్తున్నారు.
ఇక కవిత రాజకీయ భవిష్యత్ను ఇప్పుడు నిర్ణయించేది కేసీఆరే అనే టాక్ వినిపిస్తోంది. కూతురు నుంచే రాజకీయ ఇ బ్బ ందులు వచ్చినందున కేసీఆర్ వేచిచూసే ధో రణిలో ఉంటున్నారని, అత్యంత క్లిష్టమైన ఈ అంశంపై ఆయన అంత ఈజీగా చర్యలు తీ సుకునే అవకాశం లేదంటున్నారు పార్టీకి చె ందిన కొందరు నేతలు.
కేసీఆర్తో కేటీఆర్ భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో స మా వేశమయ్యారు. ఇటీవల పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. కవిత లేఖ, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వంటి అనేక అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. జూన్ 1న అమెరికా డల్లాస్లో జరిగే పార్టీ రజతోత్సవ సభల్లో పాల్గొనేందుకు కేటీఆర్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.