calender_icon.png 17 June, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలి

14-06-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,జూన్ 13(విజయ క్రాంతి): జిల్లాలో -5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో విద్య, గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, తపాలా, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 5 సంవత్సరాలలోపు గల పిల్లలందరి ఆధార్ నమోదు చేయించాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయాలని, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటిన వారు ఆధార్ బయోమె ట్రిక్ చేయించుకోవాలని తెలిపారు.

ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో గల 102 గిరిజన గ్రామాలలో ప్రధానమంత్రి జూగా పథకం కింద శిబిరాలు నిర్వహిస్తున్నందున ఆధార్ లేని వారిని గుర్తించి నమోదు చేయించాలని తెలిపారు. ఆధార్ నమోదు కేంద్రాలు, ఆధార్ కార్డులపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్ భవనం లోని ఈ- డిస్టిక్ మేనేజర్ గౌతమ్‌ను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ యు ఐ డి అసిస్టెంట్ మేనేజర్ మహమ్మద్ సౌబన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, లీడ్ డిస్టిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, విద్య, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, సి. ఎస్. సి. నిర్వాహకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని మోడల్ క్రీడ పాఠశాల లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భం గా చిన్నారులకు పలకపై అక్షరాలు దిద్దించారు. అనంతరం కాగజ్ నగర్ మండలం లోని బట్టుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పా టుచేసిన అక్షరాభ్యాస కార్యక్రమానికి ఎమ్మె ల్యే హరీశ్ బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు  ఐదే ళ్లు దాటిన 1500 మంది పిల్లలను గుర్తించి బడిలో చేర్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పుస్తకాలు, దుస్తులు ,భోజన వసతి కల్పింస్తున్నామని తెలిపారు.

ప్రైవేటు మోజులో పడి ఆర్థిక భారాన్ని మోయవద్దని ప్రజలను కోరారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో డీడీ రమాదేవి, ఏసీఎంఓ ఉద్ధవ్, డీఆర్‌డీఓ దత్తారావు, ఏపీ డీ.రామకృష్ణ, తహసీల్దార్ మధుకర్, ఎంపీడీవో ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్, నాయకులు అరిగెల నాగేశ్వరరావు, శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.