17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హార్డ్ డిస్క్‌ల ధ్వంసం సూత్రధారి ఎవరు?

13-06-2025 12:00 AM
  1. ప్రణీత్‌రావు ఇప్పటికే అప్రూవర్
  2. ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి సిట్ ప్రశ్నించే అవకాశం?

హైదరాబాద్,సిటీ బ్యూరో జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగివచ్చిన ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావును ఇప్పటికే ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించింది. ఎస్‌ఐబీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ల ధ్వంసంపై ఈ వారంలోనే సిట్  ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి ఒకేసారి విచారించే అవకాశం ఉంది.

ఇద్దరినీ కలిపి ఒకేసారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు లోకి వస్తాయిన సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసినట్లు ఇప్పటికే ప్రణీత్‌రావు అంగీకరించగా, ఎవరి ఆదేశాల మేరకు ఆ హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ చేపట్టనున్నది.

అలాగే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు మధ్య సంబంధాలు, హార్డ్ డిస్క్‌ల ధ్వంసంలో ఎవరి పాత్ర ఎంత.. అనే అంశంపై లోతైన అధ్యయనం చేయనున్నది. ఇదంతా పూర్తయితే త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కుట్ర వెనుక ఉన్న రహస్యాలన్నీ వెలుగులోకి వస్తాయని విశ్వసనీయమైన సమాచారం.