13-06-2025 12:00:00 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగివచ్చిన ఏ1 నిందితుడు ప్రభాకర్రావును ఇప్పటికే ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించింది. ఎస్ఐబీకి సంబంధించిన హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ఈ వారంలోనే సిట్ ప్రభాకర్రావు, ప్రణీత్రావును కలిపి ఒకేసారి విచారించే అవకాశం ఉంది.
ఇద్దరినీ కలిపి ఒకేసారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు లోకి వస్తాయిన సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసినట్లు ఇప్పటికే ప్రణీత్రావు అంగీకరించగా, ఎవరి ఆదేశాల మేరకు ఆ హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ చేపట్టనున్నది.
అలాగే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు మధ్య సంబంధాలు, హార్డ్ డిస్క్ల ధ్వంసంలో ఎవరి పాత్ర ఎంత.. అనే అంశంపై లోతైన అధ్యయనం చేయనున్నది. ఇదంతా పూర్తయితే త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కుట్ర వెనుక ఉన్న రహస్యాలన్నీ వెలుగులోకి వస్తాయని విశ్వసనీయమైన సమాచారం.