17 April, 2026 | 8:32 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

విద్యతోనే సమాజాభివృద్ధి..

12-06-2025 11:51 PM

బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(MLA Muta Gopal) అన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత  తల్లిదండ్రులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్ డివిజన్ లలో కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, రచన శ్రీ లతో కలిసి ఆయన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ... విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ముఖ్యంగా డ్రాప్ ఓటు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.