2 July, 2026 | 4:55 PM

Breaking News

అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •   చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •   బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •  

సీఎంపై ఫిర్యాదు ఎందుకు?

12-06-2024 01:51 AM

ఓయూ విద్యార్థుల పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): వేసవి సెలవుల నకిలీ సర్క్యులర్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్నం దున అదే వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డిపై కొత్తగా కేసు ఎందుకు నమోదు చేయాలని ఉస్మానియా విద్యార్థులను హైకోర్టు ప్రశ్నించింది. ప్రతి కేసులోనూ ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తూ పోతే ఎలా? అని నిలదీసింది. గత వేసవి సెలవుల సర్క్యులర్‌ను మార్చి ట్వీట్ చేసిన సీఎం  రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం డిస్మిస్ చేసింది.

ఈ అంశంలో చట్టపరమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించింది. సీఎం రేవంత్‌రెడ్డి నకిలీ సర్క్యులర్‌ను ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకోవాలని మే 1న, 4న ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓయూ విద్యార్థి సీహెచ్ దశరథ్ మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారించారు. వాదనల తర్వాత పిటిషన్‌ను కొట్టివేశారు.