26 May, 2026 | 5:01 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

కార్పొరేట్ల సంపద పెంపుకు కోట్లాదిమంది కార్మికుల గొంతుకు ఉరి బిగిస్తారా?

02-04-2026 12:00 AM
  1. నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయవద్దు

కలెక్టరేట్ వద్ద బ్లాక్ డే నిరసనలో కార్మిక సంఘాల నాయకుల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఏప్రిల్ ఒకటి నుండి దేశం లో నాలుగు లేబర్ కోడ్లను అమలుచేయాలని మోడీ ఆదేశాలు ఇవ్వడం కార్మిక వ్యతిరేకమైనదని,కార్పొరేట్ల సంపద పెంపుకోసం 145 కోట్ల దేశప్రజలకు,70 కోట్ల కార్మికుల గొంతుకు ఉరితాడు బిగించడానికి సిద్ధం కావడం దుర్మార్గమైoదని కార్మిక సంఘాల నేతలు ఎస్ ఏ.జలీల్,జే.సీతారా మయ్య,కంచర్ల జమలయ్య ,దొడ్డా రవికుమార్,షేక్.యాకుబ్ షావలి అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.

యావత్తు కార్మిక వర్గం లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెలను నిర్వహించి తమ వ్యతిరేక త తెలియజేసినప్పటికీ మోడీ ప్రభుత్వం కార్మిక ప్రయోజనాల కన్నా అంబానీ,అదాని లాంటి పిడికెడు మంది కార్పొరేట్ల, పెట్టుబడి దారులకు సంపదలను కట్ట బెట్టటమే లక్ష్యంగా లేబర్ కోడ్లను అమలు చేయటాని కి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. బ్లాక్ డే లో భాగం గా బుధవారం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐఎన్ టియుసి ఐఎఫ్ టియు,సిఐటియు,ఎ ఐటియుసి,టియుసిఐ సంఘాల నాయకులు ప్రసంగించారు.