26 May, 2026 | 5:51 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

అక్రమాలకు పాల్పడిన జీసీసీ ఉద్యోగి సస్పెన్షన్

02-04-2026 12:00 AM

ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ పీవో

ఉట్నూర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఆదిలాబాద్ సొసైటీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రాథోడ్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని జీసీసీ డి.ఆర్ డిపో ఇన్చార్జిగా ఉన్న రాథోడ్ గణేష్ పై పలు ఆరోపణలు రావడంతో పాటు ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేయగా 6.63 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు.

ఈ మేరకు గణేష్ పై పౌరసరఫరాల చట్టం ప్రకారం, డిపో ను సీజ్ చేసి, 6ఏ కేసు నమోదు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ జీసీసీ సీనియర్ అసిస్టెంట్ రాథోడ్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు.