అక్రమాలకు పాల్పడిన జీసీసీ ఉద్యోగి సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ పీవో
ఉట్నూర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఆదిలాబాద్ సొసైటీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రాథోడ్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని జీసీసీ డి.ఆర్ డిపో ఇన్చార్జిగా ఉన్న రాథోడ్ గణేష్ పై పలు ఆరోపణలు రావడంతో పాటు ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేయగా 6.63 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు.
ఈ మేరకు గణేష్ పై పౌరసరఫరాల చట్టం ప్రకారం, డిపో ను సీజ్ చేసి, 6ఏ కేసు నమోదు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ జీసీసీ సీనియర్ అసిస్టెంట్ రాథోడ్ గణేష్ ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు.




