11-08-2025 12:58:41 AM
- బి.ఆర్.ఎస్ నేత కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలి
- బిజెపి పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల నుండి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేసే దమ్ము బండి సంజయ్ కి ఉందా..?
- కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం
కరీంనగర్,ఆగస్ట్10(విజయక్రాంతి:రాజకీయాలలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు కల్పించాలని మొన్నటి వర కు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపో తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఈనెల 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధ ర్నా చేపట్టడం జరిగిందని కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తెలిపాడు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్ ,దుద్దిల్ల శ్రీధర్ బాబు, అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ జిల్లా నుండి అందరూ ఎమ్మెల్యేలు కా ర్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు.
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన రోజున బిజెపి, బిఆర్ఎస్ ఆమోదించి ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించిన తర్వాత బీసీల పైన వారికి ఎంత ప్రేమ ఉందో ఈరోజు బయటపడింది అన్నారు. నేడు బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరొక మంత్ర కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల నుండి మైనారిటీలను తీసినట్లయితే మేము బిల్లు ఆమోదింప చేస్తామని అన్నారు. బిజెపి నేత నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం అయిన మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది ఆయా రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లలో ఉన్నటువంటి ముస్లింలను తీసేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు నరేంద్ర మోడీ డిమాండ్ చేయాలని సవాల్ విసిరాడు.
అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి మిత్రపక్షమైన టిడిపి పార్టీకి చెందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను అక్కడ బీసీ రిజర్వేషన్లలో ఉన్న ముస్లింలను తొలగిస్తేనే మీతో మిత్రపక్షంలో కొనసాగుతామని మీరు వారిని డిమాండ్ చేయాలని కోరారు. బండి సంజయ్ కుమార్కు బీసీల పైన దళితుల పైన గాని ఏమాత్రం విశ్వాసం ప్రేమ ఉన్నట్లయితే, ఒక బిసి కాబట్టే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు నిన్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించి అదేవిధంగా మంత్రి స్థా యి వరకు వెదిగే విధంగా ప్రోత్సహిస్తే మీకు ఏమాత్రం బీసీలపైన ప్రేమ ఉన్నా ఈ బీసీ బిల్లును ఆమోదింపజేసి నువ్వు ఈ బీసీల పై న కచ్చితంగా నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని కోరారు.
బీసీలకు 42 శాతం రిజర్వే షన్ కల్పించాలని ప్రశ్నించడం మీవల్ల కాకపోతే మన రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చే నిధులను తీసుకురావాలని కోరారు.బీసీల పట్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులది మరొక తీ రని ఆనాడు ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించేందుకు హైదరాబాదులో బిఆ ర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయకుండా ధర్నా చౌక్ ను ఎత్తివేసిన చరిత్ర బిఆ ర్ఎస్ ది అన్నారు.బిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ క విత కు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మీరే కా కుండా మీ నాన్న కేసీఆర్ మీ బావ హరీష్ రావు మీ అన్న కేటీఆర్ లను ఒప్పించి ఢిల్లీకి తీసుకువెళ్లి జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్ర భుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో నాయకు లు ఏం డి తాజ్,భానోతు శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, అబ్దుల్ రెహమాన్, జెల్లోజి రాజు తదితరులుపాల్గొన్నారు.