04-06-2025 08:34:15 AM
హైదరాబాద్: నగరంలోని చంచల్గూడ చౌరస్తా(Chanchalguda Chowrasta) వద్ద మంగళవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. చంచల్ గూడ చౌరస్తా మలుపు వద్ద అతివేగంతో దూసుకొచ్చిన కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. బైకుపై వెళ్తున్న భర్త, భార్య, రెండేళ్ల కుమారైను కారు ఢీకొట్టింది. కారు ఢీకొని భార్య సీమా బేగం అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, కుమారైకు తీవ్రగాయాలయ్యాయి. బైకులపై నుంచి దూసుకెళ్లిన కారు డివైడర్ ను ఢీకొట్టి ఆగింది. కారు నడిపిన వ్యక్తిని మాదన్నపేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.