21 April, 2026 | 11:25 AM

తిరుమలలో మహిళ అదృశ్యం

21-04-2026 09:41 AM

పెద్దలు కుదిర్చిన పెళ్లి నచ్చక.. అలిగి వెళ్లిపోయిన యువతి

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) మహిళ అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మీతిరుపతమ్మ రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత గదికి వచ్చిన లక్ష్మీతిరుపతమ్మ మళ్లీ బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చక అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.