15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎస్సైలు @ మోసగాళ్లు!

25-02-2026 12:00 AM

వ్యాపారం పేరుతో మహిళకు రూ.1.82 కోట్లకు టోకరా

ఇద్దరు ఎస్సైలపై కేసు

నిందితులిద్దరూ అన్నదమ్ములు

సహకరించిన తండ్రి

భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో ఘటన

బూర్గంపాడు, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మోసాలను, నేరాలను అరికట్టి బాధితులకు అండగా నిలవా ల్సిన పోలీసులే దారితప్పి అధిక లాభాల ఆశ చూపి ఓ మహిళను నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి, మోసం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతోంది. నమ్మించి మోసం చేసిన ఇద్దరు ఎస్సైలపై బాధితురాలు బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బూర్గాంపాడు మండలం సారపాకకు చెందిన భూక్య కుమారికి.. 2023లో భద్రాచలంలో ఎస్సైగా పనిచేసిన మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అనతి కాలంలోనే 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించాడు. నమ్మించడానికి తన సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్సై రాణా ప్రతాప్‌ను రంగంలోకి దింపాడు. ఇద్దరి మాటలు నమ్మిన కుమారి.. విడతల వారీగా సుమారు రూ.1.82 కోట్లను పెట్టుబడిగా వారికి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్సైల తండ్రి చంద్రయ్య సైతం భాగస్వామి అయ్యాడు. 

డబ్బులు అడిగితే బెదిరింపులు

పెట్టబడి పెట్టిన తర్వాత లాభాలు ఇవ్వకపోవడంతో మోసాన్ని గ్రహించిన కుమారి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎస్సైలను పలుమార్లు వేడుకున్నారు. అప్పటివరకు మాయమాటలు చెప్పిన నిందితులు డబ్బు ఇవ్వకుండా దాటా వేస్తూ కాలయాపన చేశారు. విసిగి వేసారిన బాధితురాలు గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు.

పోలీస్ అధికారులు కావడంతో ఏం చేసినా చెల్లుతుంది అనే ధీమాతో ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డ బ్బులు తిరిగి రాకపోవడంతో బాధితురాలు సోమవారం తన వద్ద ఉన్న ఆధారాలతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులైన మహేష్, రాణా ప్రతా ప్, వారి తండ్రి చంద్రయ్యలపై కేసు నమోదు చేశారు.