జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం
08-03-2026 02:34 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాని వాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలకు శాలువాలు అందజేసి అభినందించారు. పంచాయతీ కార్యదర్శి సిద్ధరాములు, నాయకులు మోహన్ రెడ్డి, దార శేఖర్ తదితరులు హాజరయ్యారు. గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




