ముగిసిన మహిళల రగ్బీ లీగ్
జిమ్ఖాన గ్రౌండ్స్లో పోటీలు
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ మహిళల రగ్బీ క్రీడాభివృద్ధికి మరో ముందడుగుగా తెలంగాణ ఉమెన్స్ రగ్బీ లీగ్ సీజన్ 2 పోటీలు జింఖాన ఫుట్బాల్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రం న లుమూలల నుంచి మొత్తం 12 జట్లు పా ల్గొన్న ఈ టోర్నమెంట్ను లయన్స్ అథీనా సంస్థ అధ్యక్షురాలు కమాక్షి అగర్వాల్ ఆధ్వర్యంలో, రగ్బీ అసోసియేషన్ ఆఫ్ తెలంగా ణ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర రామ్ సహకారంతో నిర్వహించారు.
ఫైనల్ మ్యాచ్లో బ్లాక్ ఆర్చర్స్ రగ్బీ క్లబ్ జట్టు హైదరాబాద్పై 107 స్కోరుతో విజయం సాధించింది. మూడో స్థానానికి జరిగిన మ్యాచ్లో మేడ్చల్ జట్టు జంగ్పా 220 స్కోరుతో గెలిచి మూడో స్థానం దక్కించుకుంది. బ్లాక్ ఆర్చర్స్ జట్టుకు చెందిన బానుతు శిరీషా 7 ట్రైలు సాధించి టాప్ స్కోరర్గా నిలిచింది.




