కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ
న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్, నియామకాలలో అవకతవకలు, విద్యార్థులు, ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి అంశాలపై దృష్టి సారిస్తూ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) బుధవారం రాజస్థాన్లోని కోటాలో "ఎకో ఆఫ్ స్టూడెంట్స్"(Students' Echo) మెగా ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చిన గాంధీ, యువత భవిష్యత్తే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అలాగే, వారి పట్ల తన బాధ్యతను నిర్వర్తించడంలో కేంద్రం విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాజస్థాన్లోని కోటాలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న తొలి విద్యార్థుల సదస్సుకు ముందు, కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా ఇలా అన్నారు. "మోదీ అధికారంలోకి వచ్చిన గత 12 ఏళ్లుగా విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు కేవలం హామీలు మాత్రమే లభించాయి తప్ప, వాటిని అమలు చేసే దిశగా ఎటువంటి పనీ జరగలేదు. పైగా, ఇప్పుడు పరీక్షా పత్రాల లీకేజీలు విపరీతంగా పెరిగిపోవడంతో యువత కలలు కల్లలవుతున్నాయి. వారి కఠోర శ్రమ వృథా అవుతోంది. చివరికి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే, ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులతో మాట్లాడేందుకు రాహుల్ గాంధీ గారు కోటాలో పర్యటించనున్నారు." అని కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు.






