calender_icon.png 29 June, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

28-06-2025 08:58:43 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): ఇన్స్ ఫైర్ సొసైటి ఫర్ రూరల్ డెవలప్ మెంట్ (ఐఎస్ఆర్డీ)స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల సదాశివనగర్ లో మహిళా సాధికారత అంశంపై శనివారం రోజున కార్యశాల నిర్వహించడం జరిగింది. సంస్థ అధ్యక్షులు సోలంకి రవళి మాట్లాడుతూ... యాత్రనార్యంతు పూజ్యతీరమంతే  తత్ర దేవత ఎక్కడ అయితే మహిళలు గౌరవింపడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని, మహిళా అంటే ప్రకృతి, మహిళా లేకుంటే జననం లేదు, మహిళ తను సృష్టికి మూలం.

మహిళ జీవితంలో  ఏం  సాధించాలి అని కల కనడమే కాకుండా ఆ కలను సాకారం చేసుకోవడమే మహిళ సాధికారత మహిళలలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళ సాధికారత అనేది సాధ్యం అవుతుంది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు వారు సాధించలేనిది ఏమి లేదని నిరూపిస్తున్నారు, సృష్టికి మూలం అమ్మ ,అమ్మ లేనిదే ఏది లేదు మహిళ అంటేనే సహనం, ఓర్పు, ప్రేమ సమాజం లో ప్రతీ ఒక్కరిని సమన్వయం చేయగలిగే శక్తి మహిళకు మాత్రమే ఉన్న గొప్ప వరం, నింగి నుండి నేల వరకు ప్రతి ఒక రంగం లో మహిళ నేడు రాణిస్తుంది.

మహిళల కోసం చాలా చట్టాలు, న్యాయా హక్కులు ఉన్నాయి వాటిని సరైన దారిలో ఉపయోగించుకుంటూ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఆడ, మగ అనే తేడాలు లేకుండా ప్రతీ ఒక్కరిని సమనంగా చూడాలి వారికి సమాన స్వేచ్చ ను కల్పించాలి ఆకాశమంత ఆశలు అందుకోవడానికి వారికి రెక్కలు ఇవ్వండి సమాజం కట్టుబాట్లు అంటూ వారి అడుగులకు సంకెళ్ళు వేయకండి. మగపిల్లలకు ఆడవారిని గౌరవించండి  అని చెప్పడమే కాకుండా గౌరవించని వారికి గట్టిగా బుద్ధి చెప్పేలా చెయ్యండి.

ఆడవారికి ఉద్ధరించడానికి గొప్ప గొప్ప పనులు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు వారిని స్వేచ్ఛగా బ్రతకనిస్తే చాలు రాబోయే తరాలకు కావలసిన విజ్ఞానము తన బిడ్డ రూపంలో ఇముడ్చుకున్న సృష్టి కర్త అమ్మ అని వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాజారెడ్డి మాట్లాడుతూ తరాలు మారినా యుగాలు మారిన మహిళ గొప్పదనం మహిళదే ,అది మహిళలు మాత్రమే సాధ్యం తల్లిని మించిన ప్రేమ ఈ సృష్టి లోనే లేదు ఆమె ప్రేమ ముందు అన్ని చిన్నవే వారు తల్చుకుంటే చేయలేనిది ఇది లేదు ఒక పురుషుడికి ప్రపంచాన్ని పరిచయం చేసేది ఆమె అని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజా రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ నాగరాజు,ఒకేషనల్ అనిత,  వీణ దేవి, లక్ష్మి,సురేందర్, విద్యార్థులు   పాల్గొన్నారు.