13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఎలిమినేట్ అయ్యేదెవరో?

03-02-2026 01:14 AM

నాకౌట్‌కు ఢిల్లీ , గుజరాత్ రెడీ

వడోదర, ఫిబ్రవరి 2 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి దశకు చేరింది. రెండు జట్లు ఇంటిదారి పడితే, మరో మూడు జట్లు ముందంజ వేశాయి. టైటిల్ వేటలో దూసుకెళుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిగిలిన జట్లపై ఆధిపత్యం కనబరిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే మరో రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. దీనిలో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఫైనల్ ఆడనుండగా.. ఓడిన జట్టు ఇం టిదారి పడుతుంది. లీగ్ స్టేజ్ ను 5 విజయాలు, 3 ఓటములతో రెండో స్థానంతో ముగిస్తే.. ఢిల్లీ 4 గెలుపు, మూడు ఓటములతో తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే లీగ్ స్టేజ్ లో ఇరు జట్లు రెండుసార్లు తలపడితే గుజరాత్ జెయింట్స్ దే పైచేయిగా నిలిచింది.

తొలిసారి 4 పరుగులతోనూ తర్వాత 3 రన్స్ తోనూ ఢిల్లీపై గుజరాత్ గెలిచింది. ఇదిలా ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్ కావడం తో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. తమ తమ చివరి మ్యాచ్ లలో ఢిల్లీ , యూపీ వారియర్స్‌ను చిత్తు చేస్తే... గుజరాత్, ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ నిలకడగా రాణిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో గెలిచిన తర్వాత హ్యాట్రిక్ ఓటములతో వెనుకబ డింది. కానీ కీలక సమయంలో పుంజుకుని మళ్లీ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.

ఆష్లే గార్డనర్ సారథ్యంలోని గుజరాత్ కు బెత్ మూనీ, సోఫీ డివైన్ తో పాటు అనుష్క శర్మ, రేణుకా ఠాగూర్ కీలకం కానున్నారు.ఆష్లే గార్డనర్, అనుష్క శర్మ ఫామ్ లో ఉండడం అడ్వాంంటేజ్. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా టోర్నీలో అద్భుతంగా పుంజుకుంది. తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న జెమీమా రోడ్రిగ్స్ ఆరంభంలో కాస్త ఒత్డిడికి గురైనట్టు కనిపించింది. లేడీ సెహ్వాగ్  షెఫాలీ వర్మ ఇప్పటి వరకూ పెద్దగా ఆడింది లేదు. దీంతో ఎలిమినేటర్ లో ఆమె నుంచి టీమ్ మేనేజ్ మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అలాగే ఢిల్లీ జట్టు లారా వోల్వార్ట్, మరిజెన్నా కాప్, లిజెల్లీ లీ, శ్రీచరణి, మిన్నూ మణి, చినెల్లీ, స్నేహరాణపై అంచనాలున్నాయి. మ్యాచ్ కు ఆతిథ్య మిస్తున్న వడోదర పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా.