calender_icon.png 30 May, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెల రోజుల్లో పనులు ప్రారంభించాలి

29-05-2025 01:59:12 AM

- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

బోయిన్‌పల్లి, మే 28: ప్రభుత్వం మంజూ రు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు 30 రోజుల లోగా తప్పనిసరిగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లబ్దిదారులకు సూచించారు.

బుధవారం   బోయిన్ పల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో  రెండో విడత క్రింద 709 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా   మాట్లాడుతూ, బోయిన్‌పల్లి మండలం అనంతపల్లి గ్రామం లో పైలెట్ గ్రామం గా ఎంపిక చేసుకొని మొదటి విడత క్రింద 109 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయగా నేడు 50 శాతం వరకు పూర్తయ్యాయని, ప్రభుత్వం వారికి చెల్లింపులు కూడా చేస్తుందని అన్నారు. 

రెండో విడత కింద మండల వ్యాప్తంగా 709 లబ్ధిదారులను పారదర్శకంగా అరులుగా ఎంపిక చేసి నేడు ఇందిరమ్మ ఇండ్ల ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని, వీరు కూడా ఇంటి నిర్మాణం పనులు 30 రోజుల లోగా తప్పనిసరిగా ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులు లో మాత్రమే నిర్మించాలనో అన్నారు. జిల్లాలో 40 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, నిరు పేదలకు ముందుగా మంజూరు చేయాలని ప్రభుత్వం సూచనల మేరకు లబ్దిదారుల ఎంపిక చేశామని, 3 నెలల వ్యవధిలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని రానున్న పండుగలు నూతన గృహాల్లో జరుపుకోవాలని  కలెక్టర్ సూచించారు.

30 రోజుల లోగా ఏంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని లేని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. 

చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,జ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సోంత స్థలం ఉన్న నిరు పేదలను గుర్తించి బోయిన్ పల్లి మండలంలో 709 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.  ప్రజల హృదయాల్లో స్పష్టమైన ముద్ర వేసుకునేలా సిరిసిల్ల కలెక్టర్ పని తీరు ఉందని ఎమ్మెల్యే ప్రశంసించారు.

బోయినపల్లి మండలంలో ఇటీవల పేద మహిళ ఇళ్ళు కాలిపోతే సాయంత్రం వరకు 50 వేల రూపాయల ప్రభుత్వ సహాయంగా చెక్కు మంజూరు చేశారని, నీరోజపల్లి గ్రామంలో కూడా విద్యుత్ షాక్ తో మరణిస్తే ఆ కుటుంబానికి కూడా కలెక్టర్ సహకరించారని, మానవీయ కోణంతో పని చేస్తున్న జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

మిడ్ మానేరు బాధితులకు న్యాయం చేయడం కోసం త్వరలో అదనంగా మరో 1000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. బోయినపల్లి మండలంలో 4153 రైతులకు 36 కోట్ల 63 లక్షల రుణ మాఫీ పూర్తి చేశామని, గతంలో కేవలం 13 కోట్ల మాత్రమే జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, పిఏసి చైర్ పర్సన్ వెంకట రామారావు, సెజ్ సంచాలకులు సుధాకర్, పిడి హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి వినోద్, ఎంపీడీవో జయశీల సంబంధిత  అధికారులు, ప్రజా ప్రతినిధులు సురేందర్ రెడ్డి రమణారెడ్డి సుధాకర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.