గెలుపే లక్ష్యంగా పని చేయాలి

02-05-2024 01:39:14 AM

భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ అధ్యక్షుడు పోదెం వీరయ్య

భద్రాద్రి కొత్తగూడెం, మే 1(విజయ క్రాంతి): ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోదం వీరయ్య కాంగ్రెస్ శ్రేణులను కోరారు. బుధవారం భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 13 న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకొనేందుకు జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రవికుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు దేవి ప్రసన్న, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.