12 June, 2026 | 5:34 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

21-12-2025 11:27 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆదివారం జరుగుతుంది. నందిగామలో ఉన్న కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సీపీ రాధాకృష్ణన్, జిష్ణుదేవ్ వర్మ ఒకే వేదికపై ధ్యానం చేశారు. ఈ కార్యక్రమం శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా వర్చువల్ ద్వారా లక్ష మందితో జరిగే ఆన్ లైన్ ధ్యానం కోసం meditationday.global/enలో లాగాన్ అవ్వండని నిర్వాహకులు తెలిపారు.