15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

హైడ్రా కమిషనర్ గన్ మెన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

21-12-2025 12:39 PM

ఎల్బీనగర్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత గన్ మెన్ ఆదివారం తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఎల్బీనగర్ లోని కామినేని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గన్ మెన్ ఆత్మహత్యతో తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణచైతన్య హయత్ నగర్ నివాసం ఉంటున్నాడు. తన నివాసంలో ఆదివారం గన్ తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణచైతన్య ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.