5 May, 2026 | 11:28 AM

క్వార్టర్స్‌కే పరిమితం ప్రపంచ స్కాష్ టోర్నీ

22-07-2024 11:53 PM

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. బాలుర, బాలికల విభాగాల్లో మన ఆటగాళ్లు క్వార్టర్స్‌లో పరాజయాలు చవిచూశారు. బాలుర విభాగం క్వార్టర్స్‌లో భారత్ 1 తేడాతో దక్షిణకొరియా చేతిలో ఓటమి చవిచూసింది. తొలి గేమ్ యువరాజ్ గెలిచినప్పటికి శౌర్య, అరిహంత్‌లు పరాజయం పాలవ్వడంతో భారత్ పోరాటం ముగిసింది. బాలికల విభాగంలో షమీనా, అనహత్, నిరూపమ త్రయం 1 మలేషియా చేతిలో పరాజయం పాలైంది.