14-06-2025 12:30:44 AM
వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ వెల్లడి
కామారెడ్డి, జూన్ 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సంకటహర చతుర్థి సందర్భంగా సంకష్ట హర మహాగణపతి ఆలయంలో స్వయంవర-పార్వతి పంచదుర్గ పరమేశ్వరి-దీప నమస్కార ఆరాధన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ కానిపాక వినాయకుడిగా ప్రసిద్ధిగాంచిన కామారెడ్డి సంకష్టహర గణపతి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని ఆనంద శాంతి సుఖ సంతోషా జీవనాన్ని ప్రసాదించే శ్రీ సంకష్ట మా గణపతికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, శాంతి మంత్ర పటం, ప్రాత కాల పూజ, హారతి మంత్రపుష్పం భక్తులకు గణపతి నిజ రూప సందర్శనం జరుగుతుందన్నారు.
11 గంటలకు సహస్ర మోదక గణపతి హవనం సాయంత్రం 6:30 గంటలకు గణపతి కి తల పంచామృత అభిషేకం విశేషాలంకరణ రాచర్ల రవిచంద్ర శర్మ గారి ద్వారా సౌభాగ్య సిద్ధి సమస్త వృత్తి వ్యాపార దృష్టి దోష పరిహారం కొరకు దీప దుర్గా పరమేశ్వరి పూజ దీప నమస్కారములు అర్చకులు స్థానిక వేద పండితుల మహానిరాధన, మంత్రపుష్పం, వేదాశీర్వచనం, తీర్థ ప్రసాద అన్న ప్రసాద వితరణ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహిళా భక్త సమాజం సేవలతో అత్యంత ఘనంగా జరుగును. అస్తికులైన భక్తులు తప్పక దర్శించి ఈ మహా దవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ, ఆలయ కమిటీ కార్యదర్శి బాంబోతుల రవికుమార్ గౌడ్, కోశాధికారి బిల్దే విశ్వం గుప్తా తదితరులు పాల్గొన్నారు.