16 April, 2026 | 8:04 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

4 వేల గజాల పార్కు స్థలం కబ్జా!

01-11-2025 12:16 AM

స్వాధీనం చేసుకున్న హైడ్రా

ఘట్‌కేసర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో 4వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే 4వేల గజాల పార్కు స్థలం విషయమై కాలనీ అసోసియేషన్ సభ్యులు హై డ్రాకు ఫిర్యాదు చేశారు. రికార్డులు పరిశీలించిన హైడ్రా అధికారులు శుక్రవారం పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూరా ఫి న్సింగ్ వేయించారు. గతంలో ఎవ్వరూ చే యని పనిని హైడ్రా చేసినందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.