l కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి
నిజామాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్తోనే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమని కాంగ్రె స్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నా రు. శనివారం ఆయన బాల్కొండ మండలంలోని రెంజర్ల, మెండోర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించా రు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. పసుపు బోర్డు ఏర్పాటు ఏర్పా టు చేస్తామన్న బీజేపీ నేతలు ఆ తర్వాత ముఖం చాటేశారని మండిపడ్డారు. బోర్డు ఏర్పాటుకు మరో ఐదేళ్ల సమయం కావాలని బీజేపీ అభ్యర్థి అరవింద్ అంటున్నారని, రైతులు మళ్లీ మోసపోవడం ఖాయమన్నారు. రైతులను కేవలం కాంగ్రె స్ మాత్రమే ఆదుకోగలదన్నారు. ఆగస్ట్ 15 లోపు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. పార్టీ బాల్గొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్కుమార్, పార్తీ నేత అన్వేష్రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.