18-06-2025 07:41:45 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర గురుకుల మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్(Telangana State Gurukul Minority School and College)లో కామన్ యోగ ప్రోటోకాల్ బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి ఆయుర్వేద డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థినులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆ తర్వాత యోగ ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకు యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసి, వారి చేత సూక్ష్మ వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, ప్రాణాయామలు, ధ్యానము చేపించారు.
నిత్య జీవితంలో యోగ చేయడం వల్ల శరీరాన్ని దృఢంగా చేసుకోవడమే కాకుండా, మానసిక స్వస్థతను పొందవచ్చు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ డాక్టర్ సంజయ్ కుమార్, ఫార్మసిస్ట్ శ్రీధర్ ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ పర్మసిస్ట్ భూపతి, మైనారిటీ గురుకుల కాలేజీ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ నీలు, దేవపూర్ యోగ ఇన్స్ట్రక్టర్ నాగార్జున, బెల్లంపల్లి యోగ ఇన్స్ట్రక్టర్ వెంకటరమణమ్మ, ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.