03-06-2025 12:00:00 AM
సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించారు. పీపుల్మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతిప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవే గంగా జరుగుతోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధిశెట్టి కథా నాయికలుగా నటిస్తుండగా, ఇందులో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17న విడుదలై దీపావళి పండక్కి థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ డేట్ పోస్టర్, అనౌన్స్మెంట్ వీడియో ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సినీమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్బాబా; సంగీతం: తమన్; ఎడిటర్: నవీన్ నూలి.