03-06-2025 12:00:00 AM
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్హాసన్
‘థగ్లైఫ్’ సినిమా విడుదల విషయమై కమల్హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాను కర్ణాటకలో విడుదలకు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ, చలనచిత్ర వాణిజ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ను తన నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా దాఖలు చేశారు.
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్హాసన్ మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కమల్హాసన్పై కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు, సంఘాలు గుర్రుగా ఉన్నాయి.
మే 30లోగా క్షమాపణ చెప్పకపోతే ‘థగ్లైఫ్’ విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) స్పష్టం చేసింది. సినిమా విడుదల కావాల్సిన జూన్ 5వ తేదీ దగ్గర పడుతుండటంతో కమల్హాసన్ ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.