17 April, 2026 | 9:58 AM

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

11-06-2025 01:15 AM

వెల్దుర్తి, జూన్ 10: అప్పల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని ఎలుకపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన మంద స్వామి(40) అనే రైతు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో స్వామికి అప్పల భారం పెరిగిపోవడం, కుటుంబ పోషణ గడవకపోవడంతో ఇబ్బంది పడినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామి గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.