23-06-2025 12:12:39 AM
యాచారం జూన్ 22 :రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.శ్రీనాథ్, వయస్సు: (18 ) తన బ్పై స్నేహితులు రామాయణం మణిదీప్ (18) శొంటి చరణ్ (18) వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడి నుండి చింతపల్లి మండలంలోని వింజమూరు బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ పడుకున్నారు.
ఆదివారం ఉదయం నిద్రలేచి వింజమూరు నుండి జిల్లాలగూడ కు తన పల్సర్ బైక్ పై తిరిగి వస్తున్నారు. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో యాచారం సమీపంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే కండిషన్ లేని బైక్ చెట్టును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు కింద పడిపోయారు శ్రీనాథ్ తలకు బలంగా తగిలి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు.