17-05-2025 12:00:00 AM
భద్రాచలం, మే 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బస్టాండ్ ఎదుట ఉన్న లాడ్జి ముందు విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్టాం డ్ ఎదురుగా ఉన్న సామ్రాట్ లాడ్జ్ కి ఏ ర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి క రెంట్ షాక్ తో పక్కనే రూమ్ లో అద్దెకు ఉంటున్న సోమిడి వంశీ(23) అనే యువకుడు దుర్మరణం పాలయ్యారు.
సామ్రాట్ లా డ్జి ట్రాన్స్ఫార్మర్ పక్కనే వున్న భవనంలో అద్దెకు ఉంటున్న సోమిడి వంశీ ఉదయమే బ్రష్ చేస్తూ ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి చాలా సేపు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు.లాడ్జి నిర్వాహకులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన విషయంలో సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఈ ఘటనకు దారి తీసింది.
తెల్లవారు జామునుంచే భారీ వర్షం కురవడం, ట్రాన్స్ఫార్మర్ తీగలు పక్కనే ఉం డడం వంశీకి షాక్ తగిలి సుమారు 5 నిముషాల పాటు మృత్యువుతో పోరాడి నట్లు స్థానికులు చెప్తున్నారు.సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలిసులు, పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
మృతుడు ములుగు జిల్లా,వా జేడు మండలం జగన్నాధపురం గ్రామ నివాసి గా గుర్తించారు.మృతుడు పట్టణం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. వంశీ తల్లిదండ్రులు, బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.