calender_icon.png 15 June, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ షీట్స్ వేస్తూ యువకుడి మృతి

12-06-2025 12:48:14 AM

రాజాపూర్ జూన్ 11 : మండలంలోని గుండ్లపొట్ల పల్లి గ్రామంలో ఓ పరిశ్రమలో ప్లాస్టిక్ షీ ట్స్ వేస్తూ ప్రమాదవశాత్తు యువకుడు క్రింద పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్త్స్ర శివానంద్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలీమ్ అనే వ్యక్తి గుండ్లపొట్ల పల్లి గ్రామంలోని పరిశ్రమ లో పాత రేకుల సిట్స్ తొలగించి కొత్తవి వేసేందు పని మాట్లాడుకున్నారు.సలీమ్ అతని కుమారులు హమీద్,రియాజ్ ,ఇలియజ్ కలిసి మంగళవారం పరిశ్రమలో సిట్స్ వేస్తున్న క్రమంలో హమీద్ కాలుజరి పైనుంచి పడిపోయాడు.

వెంటనె కుటుంబ సభ్యులు హమీద్ ను జడ్చర్ల దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని తండ్రి పిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.