1 June, 2026 | 1:22 PM

Breaking News

ఏపీ నాయకులపై కవిత సంచలన వ్యాఖ్యలు.. TRS 2.0తో పెట్టుకుంటే..!   •   Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •  

అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు

01-06-2026 12:18 PM

నిజాంసాగర్ జూన్ 01(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కోడూరి శ్రీశైలం అగ్ని వీర్  కు అర్హత సాధించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. సామాన్య గొర్రెల కాపరి కుటుంబం నుంచి  అగ్ని వీరుకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు ఉద్యోగంతో పాటు దేశ సేవ చేసే భాగ్యం లభించినందుకు సంతోషంగా ఉందని  తండ్రి కోడూరి సంగమేశ్వర్ తెలిపారు. మారుమూల ప్రాంతం నుండి దేశ సేవ చేసే అవకాశం లభించడంతో గ్రామస్తులు యువకుడ్ని అభినందిస్తున్నారు.