calender_icon.png 10 February, 2026 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి ఆత్మహత్య

10-02-2026 12:52:34 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రేమించిన ప్రియురాలు తనకు దక్కదేమోనని మనస్తాపంతో ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బేల మండలం లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బేల మండల కేంద్రాని కి  చెందిన నిపుంగే రూపేష్ (21) డిగ్రీ చదువుతున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన తన క్లాస్ మెంట్ అమ్మాయిని ప్రేమించాడు.

ఐతే ఇటీవల అమ్మాయి కుటుంబీకులు వేరే అబ్బాయితో అమ్మాయికి వివాహం కుదిరిచారు.  దీంతో ఆ యువకుడు తన ప్రేమికురాలు దూరం అవుతుందని తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీరు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.