18-07-2025 01:01:42 AM
కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): డ్రగ్స్ ,గంజాయి ,కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలను అరికట్టే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. గురు వారం కామారెడ్డి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యాచ రణ ప్రణాళికను సమీక్షించి భవిష్యత్తు లో చేయవలసిన కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారు.
గంజాయి , కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలు తాగే వారి అలవాటు మనిపించడం కోసం ఎన్జీవో లు, వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో వారిని ఆ అలవాటు నుండి బయట పడేలా చేయాలని కోరారు. అన్ని విద్యా సంస్థలు, విద్యార్థుల కు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు వివరించాలని అన్నారు. జిల్లా అధికారులు అందరూ పూర్తి సహకారం తో కామారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా చేయాలని కోరారు.
జిల్లా ఎస్ పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ ఎన్ డి పి ఎస్ చట్టం అమలు చేసేటప్పుడు సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చట్టం లో ని నిబంధనల ను తు చ తప్పకుండా పాటించాలని అన్నారు ,డ్రగ్స్ బారిన పడిన వ్యక్తులను వారి ప్రవర్తన, శారీరక లక్షణాలు బట్టి గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ లో చేర్పించాల న్నారు.
జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్, జిల్లా ఎక్సైజ్ సూపర్ఇండెంట్ అధికారి B.హను మంతరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల ,వివిధ ఎన్జీవోసంఘాలు పాల్గొన్నారు.