calender_icon.png 27 October, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు యువ ఇంజినీర్ హనుష దురిశెట్టికి అంతర్జాతీయంగా అరుదైన గౌరవం

27-10-2025 01:15:24 AM

- ఏఐ ఆధారిత ఇన్నోవేషన్ లో విశేష ప్రతిభ..

- 85 దేశాల్లో ఉన్న మహిళ ఇంజనీర్లలో సాంకేతిక ప్రతిభకు అవార్డు ప్రధానం

- ఆమె రూపొందిస్తున్న ఏఐ ఆధారిత సాంకేతిక పరిష్కారాలు ఎనర్జీ రంగంలోనే మంచి పేరు

కరీంనగర్, అక్టోబర్26(విజయక్రాంతి):కరీంనగర్ కు చెందిన తెలుగు యువ ఇంజినీర్ హనుష దురిసేటి మరో అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. సొసైటీ ఆఫ్ ఉమెన్ ఇంజినీర్స్ (ఎస్ డబ్ల్యూ ఈ) సంస్థ నుంచి ఆమెకు రైజింగ్ టెక్నికల్ కాంట్రిబ్యూటర్ అవార్డు లభించింది.

ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో ఉన్న మహిళా ఇంజినీర్లలో ప్రారంభ దశలోనే విశేష సాంకేతిక కృషి చేసిన వారికి ఇస్తారు. ప్రస్తుతం హనుష ఐరన్ మౌంటెన్ అనే సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె రూపొందిస్తున్న ఏఐ ఆధారిత సాంకేతిక పరిష్కారాలు ఎనర్జీ రంగంలో డేటా మేనేజ్మెంట్ను మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. 

విద్యలోనూ ప్రతిభ..

హనుష సిబిఐటీ లో కెమికల్ ఇంజినీరింగ్లో గోల్ మెడల్ సాధించారు. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ నుండి పద్మశ్రీ బి.వి. రాజు బెస్ట్ స్టూడెంట్ అవార్డు అందుకున్నారు.తరువాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. అక్కడ ఊప్ స్టార్ట్ ఇంటర్ ప్రెనర్ షిప్ కాంపిటీషన్లో 50 బృందాల్లో మొదటి స్థానంలో నిలిచింది. సాంకేతికతతో హౌసింగ్ సమస్యలకు పరిష్కారం చూపే ప్రాజెక్ట్ రూపొందించారు. ఆపై ఇజ్రాయెల్లో జరిగిన టెక్నియన్ మెడికల్ హ్యాకథాన్లో రెండో స్థానం సాధించారు.

హాకథాన్ జడ్జ్గా సేవలు..

హనుష అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల హాకథాన్లలో జడ్జ్గా కూడా సేవలందిస్తున్నారు. వీటిలో హార్వర్డ్ ( హాక్ హార్వర్డ్), యేల్ (వైహాక్స్), యూ.సీ. బర్క్లీ (కాల్హ్యాక్స్ ), జార్జియా టెక్ (ఏ ఈ ఏ టీ ఎల్ ), యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్ వంటి సంస్థలు ఉన్నాయి. యువ ఆవిష్కర్తలకు మార్గదర్శకత్వం అందిస్తూ, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు.

ఏఐ ఆధారిత సాంకేతిక పరిష్కారాలు..

హనుష రూపొందించిన ఏఐ ఏజెంట్లు కంపెనీలకు వేలాది లీజు ఒప్పందాలు, భూమి పత్రాలు, చట్టపరమైన డాక్యుమెంట్లను సులభంగా చదివి విశ్లేషించే సామర్థ్యాన్ని ఇస్తాయి. ఈ ఏజెంట్లు చెల్లింపులు, రిన్యూల్ తేదీలు, రిస్క్ ఫ్యాక్టర్లు వంటి అంశాలను గుర్తించి సమయానికి సూచిస్తాయి. దీంతో సమయం, వ్యయం రెండూ తగ్గుతాయి.

సాంకేతికతతో సమాజ సేవ లక్ష్యం:

ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఏఐ ఆధారిత ఇన్నోవేషన్ ద్వారా పరిశ్రమలతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడే పరిష్కారాలను అందించాలనేది నా లక్ష్యం, అని హనుష దురిసేటి తెలిపారు. హనూష తండ్రి దురిసేటి రఘు చందర్ జగిత్యాల డిఎస్పీగా పని చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయగా పేరు ప్రఖ్యాప్తులు సంపాదించుకున్నారు. హనూష అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం పై వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కరీంనగర్ వాసులు అభినందనలుతెలిపారు.