17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మాదాపూర్ దుర్గంచెరువులో యువతి ఆత్మహత్య

20-06-2025 12:00 AM

శేరిలింగంపల్లి, జూన్ 19: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృత దేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ అడ్డగుట్టకు చిందిన బి. సుష్మ (27) హైటెక్ సిటీలో ఉన్న డైబోల్డ్, నిక్షి డో రఫ్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నది. అయితే 18వ తేదీ కూడా ఉద్యోగానికి వెళ్ళింది అయితే ఎంతకి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి అంజయ్య ఆఫీస్ మేనేజర్‌ను సంప్రదిస్తే ఆఫీస్ నుండి వెళ్లి పోయిందని తెలిసింది.

దీంతో గురువారం ఉదయం 7.00 గం.లకు దుర్గం చెరువులో తప్పిపోయిన మహి ళ సుష్మ మృతదేహం తేలుతున్నట్లు సమాచారం అందింది. ఎన్డీఆర్‌ఎఫ్ సాయంతో పోలీసులు శవాన్ని స్వాధీ నం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు ఆత్మహత్య చేసుకున్నదా లేదా ఎవరైనా తోసేశారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.