20-06-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, జూన్ 19: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృత దేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ అడ్డగుట్టకు చిందిన బి. సుష్మ (27) హైటెక్ సిటీలో ఉన్న డైబోల్డ్, నిక్షి డో రఫ్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నది. అయితే 18వ తేదీ కూడా ఉద్యోగానికి వెళ్ళింది అయితే ఎంతకి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి అంజయ్య ఆఫీస్ మేనేజర్ను సంప్రదిస్తే ఆఫీస్ నుండి వెళ్లి పోయిందని తెలిసింది.
దీంతో గురువారం ఉదయం 7.00 గం.లకు దుర్గం చెరువులో తప్పిపోయిన మహి ళ సుష్మ మృతదేహం తేలుతున్నట్లు సమాచారం అందింది. ఎన్డీఆర్ఎఫ్ సాయంతో పోలీసులు శవాన్ని స్వాధీ నం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు ఆత్మహత్య చేసుకున్నదా లేదా ఎవరైనా తోసేశారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.