calender_icon.png 20 June, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికిల్ సెల్ అనీమియా వ్యాధి నివారణకు వైద్య సిబ్బంది కృషి చేయాలి

20-06-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ 

భద్రాచలం, జాన్ 19 (విజయ క్రాంతి) సికిల్ సెల్ అనీమియా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివా సి గిరిజన గూడెంలలోని గిరిజన పిల్లలకు ఎక్కువగా వారసత్వంగా సంక్రమిస్తుందని, వ్యాధి లక్షణాలు సంక్రమించిన పిల్లల నుంచి పెద్దల వరకు త్వరగా గుర్తించి సరైన వైద్య చికిత్సలు అందిస్తే అదుపులోకి వస్తుందని, అందుకు ఏజెన్సీ ఏరియాలో చేస్తున్న వైద్య సిబ్బంది ప్రత్యేక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు తప్పని సరిగా రక్త పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

గురువారం ప్రపంచ సికిల్ సెల్ అనిమియా ది నోత్సవం సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి రాహుల్ ఇతర శా ఖల అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వ్యాధి ప్రాణాంతకమైనది కాదని, ఈ వ్యాధి జన్యుపరంగా కాకుం డా తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుందని ముఖ్యంగా మన శరీరంలో ఎర్ర రక్త కణాలు 120 రోజులకి నశించి తిరిగి కొత్త రక్త కణాలు వస్తుంటాయని, ఈ వ్యాధి సోకిన వారికి 20 రోజులలోనే ఎర్ర రక్త కణాలు నశించి మన శరీరానికి అంతా పాకిపోయి రక్తహీనత, విపరీతమైన నొప్పి,

చేతులు కాళ్లు వాపు, ఇన్ఫెక్షన్లు రావడం, పెరుగుదలలో జాప్యం జరగడం, దృష్టి సమస్యలు, అవయవ నష్టం, అంధత్వం, తీవ్రమైన చాతినొప్పి గుండె జబ్బులు, అల్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో భాస్కర్, ఏసీఎంవో రమణయ్య, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ విజయలక్ష్మి, ఏ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చైతన్య, సికిల్ సెల్ ప్రోగ్రాం అధికారి మధుకర్, ఆర్ ఎం ఓ రాజశేఖర్ మరియు ఇతర శాఖల అధికారులు వైద్య సిబ్బంది నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.