23 June, 2026 | 11:32 AM

యువతి మిస్సింగ్

24-04-2025 12:33 AM

చేవెళ్ల, ఏప్రిల్ 23:యినాబాద్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయ్యింది. పో లీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఏనుగుల ప్రిన్సీ(19)..  చదువుకుంటోంది. మంగళవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు వనజ, పునేష్ ఎప్పటి లాగే.. పనికోసం బ యటికి వెళ్లారు.

సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చే సరికి ప్రిన్సీ కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువుల ఇండ్ల వద్ద  వెతికినా  ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.