16 March, 2026 | 10:20 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి

24-04-2025 12:32 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. ఏప్రిల్ 23 (విజయక్రాంతి):భూ భారతి పోర్టల్ ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన జిల్లా లోని మద్దూరు మండలంలో నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సులలో  వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.

భూ భారతి ఫైలెట్ ప్రాజెక్టు మద్దూరు మండలంలోని గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో రైతుల నుంచి స్వీకరించిన సమ స్యల దరఖాస్తుల పరిశీలనకు కోస్గి, మద్దూరు మండలాల తహాసిల్దార్ల  నేతృ త్వంలోని రెవెన్యూ అధికారుల బృందం మద్దూరు తహాసిల్దార్  కార్యాలయంలో  సమస్యల వారీగా దరఖాస్తుల పేపర్ వర్క్ చేస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మద్దూరు తహసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షించారు.      

ఈ కార్యక్రమంలో  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ప్రత్యేక అధికారి యాదగిరి, తహసిల్దార్లు బక్క శ్రీనివాస్, అనిల్ కుమార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.