24 June, 2026 | 12:02 AM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

అధిక వేగం ప్రాణం తీసింది..

02-12-2025 07:13 PM

చందుపట్ల వద్ద స్కూటీ అదుపుతప్పి యువకుడు దుర్మరణం

చివ్వెంల (విజయక్రాంతి): చివ్వెంల మండలం చందుపట్ల గ్రామ శివారులో జరిగిన దుర్ఘటన స్థానికులను కలచివేసింది. స్కూటీ అదుపుతప్పి పడిపోవడంతో 28 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే... ఆత్మకూరు ఎస్ మండలం దాచారం గ్రామానికి చెందిన పల్లెటి నవీన్, తండ్రి శ్రీనయ్య సూర్యాపేట నుండి మోతే వైపు తన స్కూటీపై ప్రయాణిస్తున్నాడు. వేగం ఎక్కువగా ఉండటం వలన చందుపట్ల గ్రామం వద్ద వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. 

తలకు తీవ్రమైన గాయాలు కావడంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి అకాల మరణంతో దాచారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మితమైన వేగంతో ప్రయాణించాలని, రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.