calender_icon.png 24 June, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

24-06-2025 12:12:02 AM

పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం, జూన్ 23 (విజయ క్రాంతి):యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని నగరంలోని రిక్కబజార్ విద్యార్థులకు సోమవారం ని ర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ముఖ్యతిదిగా పాల్గోని స్కూల్ అవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సరదా కోసం మొ దలైన అలవాటు మత్తులోకి నెడుతోందని, గతంలో సిగరెట్, మద్యంతో సరిపెట్టుకునే యువత ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అ న్నారు. సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వా మ్యం కావాలని అన్నారు.మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

మాదకద్రవ్యాలకు నేటి యువత బాన మాదకద్రవ్యాల బానిసలై విముక్తిపొందిన వారితో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను గురించి తెలియజేసినట్లైతే , యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించవచ్చ న్నారు.ఎవరైనా చెడు వ్యసనాలకి మారినట్లయితే తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908, డయల్ 100 కానీ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సమాచారం ఇ వ్వాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో, ఖమ్మం ఏ సి పి ఏసిపి రమణమూర్తి, టూ టౌన్ సి ఐ బాలకృష్ణ , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి శాంత మండల విద్యాశాఖ అధికారి శైలజ లక్ష్మీ పాఠశాల ఉపాధ్యాయులు కట్టా శేఖర్ రావు సుజాత ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.