15-06-2025 12:09:04 AM
పెన్ పహాడ్: గంజాయి తరలిస్తున్న యువకులు అరెస్ట్ అయిన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలో శనివారం జరిగింది. ఎస్ఐ గోపి కృష్ణ(SI Gopi Krishna) తెలిపిన ప్రకారం..సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన బొమ్మకంటి గోపి 500గ్రాముల గంజాయిని తన స్నేహితులతో కలసి బైకులపై చివ్వేంల మండల పరిధిలోని దురాజ్ పల్లి గుట్టలలోకి సేవించడానికి వెళ్తుతుండగా మండల పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు.
పట్టుబడిన వారిలో మాచారం గ్రామానికి చెందిన బొమ్మకంటి గోపి తో పాటు పేరం శ్రీకాంత్, ఇంద్రవల్లి జీవన్ కుమార్,.పెన్ పహాడ్ కు గ్రామానికి చెందిన పేరం శివ, నారాయణ గూడెం గ్రామానికి చెందిన పరుష బోయిన రమేష్ ను అరెస్ట్ చేసి ఒక్కోకరి వద్ద 100 గ్రామాలు చొప్పున 500 గ్రాముల గంజాయిని, ఐదు మోటార్ బైక్ లు మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకునట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ నిందితులు గత రెండు నెలల క్రితం ఒరిస్సా సరిహద్దు ప్రాంతంగంజాయి ని తెచ్చుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి సూర్యపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ .సి.ఐ రాజశేఖర్ వద్ద హాజరు పరరిచినట్లు తెలిపారు.