calender_icon.png 18 June, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ అనేది పుకారు కాదు.. అది వాస్తవం: వైఎస్ షర్మిల

18-06-2025 05:39:03 PM

హైదరాబాద్: తెలంగాణ సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలనాత్మక ఆరోపణలు చేశారు. తన ఫోన్‌, భర్త అనిల్ ఫోన్‌, తన దగ్గరి వాళ్ల ఫోన్లు చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారని, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి(Senior YSRCP Leader YV Subba Reddy) తన ఇంటి వెళ్లి చెప్పారని, ట్యాప్ చేసిన ఒక ప్రైవేట్ కాల్స్ రికార్డ్ ను స్వయంగా ప్లే చేసి వినిపించారని షర్మిల ఆరోపించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది పుకారు కాదు, అది వాస్తవం అని అన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి షర్మిలకు సుబ్బారెడ్డి స్వయంగా వినిపించారని పేర్కొన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా అని, బైబిల్ పై ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాడు వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మధ్య సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్ అని షర్మిల విరుచుకుపడ్డారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యాలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా, బీఆర్ఎస్ హాయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన 650 మందికి పైగా నాయకులు అక్రమ నిఘా బాధితులని విమర్శించారు.

ఎన్నికల సమయంలో రాజకీయ గూఢచర్యం కోసం బీఆర్ఎస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (BRS Special Intelligence Bureau)ను దుర్వినియోగం చేసిందని పేర్కొంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు వాంగ్మూలం ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన ప్రకారం, రాజకీయ నాయకులేకాకుండా మీడియా నిపుణులు మరియు అధికారులు కూడా నిఘాలో ఉన్నారని, ఇది గోప్యత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది నిఘా కాదు, ఇది రాజకీయ వేధింపులు, బీఆర్ఎస్ కింద తెలంగాణ పోలీసు రాష్ట్రంగా మారిందని గౌడ్ మీడియాతో అన్నారు.