17 April, 2026 | 10:06 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జహీరాబాద్ బీజేపీ నేతలు మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక..

05-04-2025 10:13 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, మాజీ సీడీసీ చైర్మన్ రమాకాంత్ పాటిల్ తో పాటు పలువురు మాజీమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శనివారం హైదరాబాద్ లో బీజేపీకి చెందిన నాయకులు బీఆర్‌ఎస్ లో చేరిన్నారు. మాజీ సీడీసీ ఛైర్మన్ ఉమాకాంత్ పాటిల్, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు బస్వరాజు, మాజీ ఎంపీటీసీలు విజయేందర్ రెడ్డి, సంతోష్ పాటిల్, సీనియర్ నాయకులు సుభాష్ రావు, భూమయ్య, లక్ష్మయ్యతో పాటు ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిథున్ రాజ్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.