27-06-2025 06:06:18 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామం పరిధిలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని, సరుకులను, కూరగాయలను, అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులు పాఠ్యఅంశాలను గురించి తెలియజేశారు.
అనంతరం సీఈవో శోభారాణి మాట్లాడుతూ... విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని, అల్పాహారాన్ని, స్నాక్స్ ను అందజేయాలని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పాఠశాలల్లోని ఏను విద్యార్థుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జితేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి జ్యోతిలక్ష్మి ప్రిన్సిపాల్ దుర్గ తదితరులు పాల్గొన్నారు.